హనుమాన్ హీరో తేజ సజ్జను సత్కరించిన మంత్రి కిషన్ రెడ్డి

హనుమాన్ హీరో తేజ సజ్జను సత్కరించిన మంత్రి కిషన్ రెడ్డి

హనుమాన్(HanuMan) మూవీ వీరవిహారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja)-ప్రశాంత్ వర్మ(Prashanth varma) కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబడుస్తోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. ఓవర్ సీస్ లో ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయాలనీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. దీంతో హనుమాన్ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా హనుమాన్ హీరో తేజ సజ్జ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)ని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తేజను శాలువాతో సత్కరించారు కిషన్ రెడ్డి. సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. ఇదే విషయాన్ని మంత్రి కిషన్ రెడ్డి తన సోషల్ మీడియాలో ప్రస్తావించారు. హనుమాన్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యువ నటుడు తేజ సజ్జను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా.. ప్రతి టిక్కెట్టు నుండి రూ.5 లను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం.. అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.