వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

హైదరాబాద్ : సికింద్రాబాద్ రాణిగంజ్ 1 డిపోకు చెందిన తిరుపతి రెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం డిపోకు వచ్చిన తిరుపతి రెడ్డి... అధికారులు డ్యూటీ ఇవ్వలేదు. దీంతో డిపో ముందే... పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే.... ఉస్మానియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. దీంతో డిపో దగ్గర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారుల వేధింపులతోనే తిరుపతి రెడ్డి సుసైడ్ చేసుకున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత కొద్దికాలంగా అధికారులు వేధిస్తున్నారని చెబుతున్నారు.