165 మంది చిన్నారులకు  కంటి అద్దాలు

165 మంది చిన్నారులకు  కంటి అద్దాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని ఆసిఫ్ నగర్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యూ టౌన్ చారిటబుల్ ట్రస్ట్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీటీ) ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరిచందన దాసరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఆమె మాట్లాడుతూ స్కూల్లో 300 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా దాదాపు 165 మందికి  పైగా కంటి సమస్యలున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఎన్ టీసీటీ చైర్మన్, జనరల్ సెక్రెటరీ సయ్యద్ షాజీ ఉద్దీన్, వైస్ చైర్మన్ మునవర్ సాబేర్ ఖాన్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ డాక్టర్ వెంకటి, తహసీల్దార్ జ్యోతి, డిప్యూటీ డీఈఓ బాలు నాయక్, హెచ్​ఎం కృష్ణమూర్తి పాల్గొన్నారు. అంతకుముందు ఆసిఫ్ నగర్ తహసీల్దార్ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు.