
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’.ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత AM రత్నం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నేడు (మే30న) నిర్మాత AM రత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన పలు అంశాలపైనా ఆయన సీఎంతో చర్చించినట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ వెల్లడించింది. అలాగే తెలంగాణలో ఈ మూవీ టికెట్ ధరల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిపింది.
‘నిర్మాత AM రత్నం గారు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గారిని హరి హర వీరమల్లు మూవీ గురించి చర్చించడానికి కలిశారు. ఈ చిత్రం 17వ శతాబ్దంలో చారిత్రక కథతో వస్తోన్నందున సీఎంతో చర్చించడం జరిగింది.
►ALSO READ | Bhairavam Review: ‘భైరవం’ ఫుల్ రివ్యూ.. సినిమా కథేంటీ? ముగ్గురు హీరోలు కమ్బ్యాక్ ఇచ్చేనా?
అయితే, ఈ మూవీ సాధారణ వాణిజ్య చిత్రాలకు భిన్నంగా భారీ స్థాయిలో రూపొందించబడిన చారిత్రక ఇతిహాసం కావడంతో టిక్కెట్ ధరల సవరణ విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. మాకు తన విలువైన సమయాన్ని మరియు మద్దతును ఇచ్చినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని నిర్మాణ సంస్థ పోస్టులో వెల్లడించింది.
Producer @AMRathnamOfl garu met with Hon’ble @TelanganaCMO Shri @revanth_anumula garu to discuss about #HariHaraVeeraMallu
— Mega Surya Production (@MegaSuryaProd) May 30, 2025
As the film is set in the 17th century, it is a historical epic crafted on a grand scale, distinct from regular commercial films. The meeting also touched… pic.twitter.com/RtMNV9UhCh
అయితే, పుష్ప 2 తొక్కిసలాట ఘటన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు ఉండబోదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎలాంటి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండవని తేల్చి చెప్పింది. ఇలా ఈ ఏడాది టికెట్ ధరల పెంపుకై ఏ ఒక్క నిర్మాత ప్రభుత్వాన్ని అడగడం లేదు. ఈ క్రమంలో వీరమల్లు నిర్మాత కలిసి విన్నవించుకోవడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి నెలకొంది.
GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹
— Mega Surya Production (@MegaSuryaProd) May 16, 2025
Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥
The battle for Dharma begins... 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM pic.twitter.com/Jvxd02JW5a
ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా.. ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజిక్ అందించాడు. మొఘల్స్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి సంపాదించే బందిపోటు పాత్రలో పవన్ నటించాడు. ఖడ్గానికి, ధర్మానికి మధ్య జరిగే కథ అనే క్యాప్షన్ తో మూవీ వస్తోంది. అందుకే ఫస్ట్ పార్ట్కు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ధర్మానికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్, ఖడ్గానికి ప్రతీకగా బాబీడియోల్ కనిపిస్తారు.