హైదరాబాద్, వెలుగు: హ్యామ్రోడ్లలో భారీగా అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్శాఖల్లో టెండర్లను 25 శాతం ఎక్సెస్తో కోట్ చేశారన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్ చాట్చేశారు. ఒక కంపెనీ ఏకంగా 75 శాతం ఎక్సెస్కు టెండర్వేసిందని చెప్పారు. ఆర్అండ్బీలో రూ.11 వేల కోట్లతో టెండర్లు పిలిస్తే.. అదనంగా కలిపి రూ.15 వేల కోట్ల వరకు పోయిందని, పంచాయతీరాజ్ శాఖలో రూ.6 వేల కోట్లకు పిలిస్తే రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఎక్కువకు పోయిందని పేర్కొన్నారు.
దీనివల్ల రూ.5 వేల కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోందని తెలిపారు. హ్యామ్మోడల్లో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం ప్రైవేట్భాగస్వామ్యంతో రోడ్లు వేస్తారని చెప్పారు. కానీ, ఆ 60 శాతం అమౌంట్నూ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి 30 ఇన్స్టాల్మెంట్లలో 15 ఏండ్లు ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమైందన్నారు. ఈ టెండర్లలో 10 శాతం మొబిలైజేషన్అడ్వాన్సులు ఇచ్చేందుకు సర్కారు రెడీ అయిందని ఆరోపించారు.
వచ్చిన టెండర్లలో ఒక్క కంపెనీకే 15 టెండర్లు దక్కాయన్నారు. అధికారులకు ఎక్స్టెన్షన్ఇస్తే నాడు తమపై దుమ్మెత్తిపోసిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు రిటైరైన ఆఫీసర్లకు ఎక్స్టెన్షన్ఇస్తున్నారని, వారితో అక్రమ మార్గంలో టెండర్ల ప్రక్రియ చేపడుతున్నారని విమర్శించారు. ఆర్అండ్బీ సీఈ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్సీఈ జోగారెడ్డి పదవీ కాలం పెంచారని, ఇరిగేషన్ఈఎన్సీకి ఎక్స్టెన్షన్ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్వైజర్లు కూడా ఉండరని చెప్పిన సీఎం.. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక 10 మంది అడ్వైజర్లను నియమించారని మండిపడ్డారు.
