ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి: హరీశ్‌రావు

ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి: హరీశ్‌రావు

ప్రతిపక్షాలను బద్నాం చేయడంపైనే కాంగ్రెస్‌ దృష్టి సారించిందని మాజీ మంత్రి హరీష రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే.. ఎన్నో కేసులు పెట్టేవాళ్లమని చెప్పారు. ప్రతిపక్షాలపై దాడుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని.. ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయమై తమ ప్రభుత్వం ఆలోచించేదని వివరించారు. రెచ్చగొట్టినా మీ ట్రాప్‌లో పడం.. ప్రజల పక్షాన పోరాడతామన్నారు.

కాంగ్రెస్‌ అహంకార పూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. హామీల అమలు గురించి అడిగితే చెప్పుతో కొడతామని ఒకరు, మరొకరు మరో విధంగా.. ఒక్కోక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండని హరీష్ రావు ప్రశ్నించారు. 

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి కేసీఅర్ ఫార్మ్ హౌస్ లో  బీఆర్ఎస్ పార్టీ  పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, నామ నాగేశ్వర రావు, కేశవరావు, మాలోతు కవిత, రవీందర్ తో పాటు పలువురు బీఆర్ఎస్  కి చెందిన నేతలు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.