
సిద్ధిపేట్ ను ఎడ్యుకేషన్ హబ్ చేయాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలో కొత్తగా నిర్మించిన పీజీ కాలేజీ కొత్త భవనంతో పాటు లేడిస్ హాస్టల్ ను ప్రారంభించారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులు వంద శాతం ఉత్తీర్ణత వచ్చేలా కష్టపడి చదవాలన్నారు. ప్రస్తుతం ఉన్న 4కోర్సులతో పాటు మరో రెండు కోర్సులుకు కృషి చేస్తానన్నారు.