ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీస్కోండి ..పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్‌‌‌‌కు హరీశ్ లీగల్ నోటీసులు

ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీస్కోండి ..పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్‌‌‌‌కు హరీశ్ లీగల్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: క్షుద్ర పూజలు చేశారంటూ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడడం తగదని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్‌‌‌‌ను మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​డిప్యూటీ ఫ్లోర్​లీడర్​హరీశ్ రావు డిమాండ్​చేశారు. అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్​రెడ్డి వంటి వాళ్లు చేసిన కామెంట్లను రిపీట్​చేశారని, కాంగ్రెస్​ నేతలకు చర్చించేందుకు వేరే అంశాలు ఏవీ దొరకకపోవడం వల్లే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ మేరకు మంగళవారం ఆయన మహేశ్​కుమార్​గౌడ్‌‌‌‌కు లీగల్​నోటీసులు పంపారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లనూ వదలడం లేదన్నారు. ఆలయాలకు వెళ్లడమేమీ నిషేధం లేదని, తన పరువుకు నష్టం కలిగించేలా కామెంట్లు చేయడం దారుణమని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే తనపై చేసిన నిరాధార ఆరోపణలు వెనక్కు తీసుకోవాలన్నారు. వెబ్‌‌‌‌సైట్లు, సోషల్​మీడియాల్లో పోస్ట్​ చేసిన కంటెంట్‌‌‌‌ను వెంటనే తొలగించాలని కోరారు. లేదంటే చట్టపరంగా సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.