
పోలీసులకు మాజీ మంత్రి హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు పెడితే వారి పేర్లు రెడ్ బుక్ రాసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ భవన్ లో మాట్లాడిన హరీశ్ రావు.. అభివృద్దిలో కేసీఆర్ అగ్రగామి అయితే..రేవంత్ అబద్దాల్లో అగ్రగామి. ఇవాళ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మాట్లాడిన సీఎం రేవంత్ మహిళలకు 21 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. అన్ని వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నా సవాల్ ను రేవంత్ స్వీకరించాలి. ఏడాదిలో రేవంత్ ఇచ్చింది 60 వేల ఉద్యోగాలు కాదు..కేవలం 10 వేల ఉద్యోగాలే. బీఆర్ఎస్ ఎవరితో పొత్తుపెట్టుకోదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ కు వంద సీట్లు ఖాయం..కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం అని అన్నారు.
ఏపీ బనకచర్లపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి గోదావరి- బనకచర్లను అడ్డుకుంటాం.అతి చేస్తున్న అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకుని గుణపాఠం చెప్తాం.మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రం పరువు తీశారు అని హరీశ్ అన్నారు.