ఉద్యమంలో లాయర్ల పాత్ర మరువలేనిది

ఉద్యమంలో లాయర్ల పాత్ర మరువలేనిది

అడ్వకేట్ వెల్ఫెర్ కోసం 100 కోట్లతో నిధి ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు మంత్రి హరీశ్ రావు. MLC అభ్యర్థి వాణిదేవీ తరపున వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ప్రచార సభలో హరీష్ పాల్గొన్నారు. ఉద్యమంలో లాయర్ల పాత్ర మరువలేనిదన్నారు. కరోనా టైంలో అడ్వకేట్లకు 25 కోట్ల సాయమందించామని గుర్తు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు గత ఆరేళ్లలో అడ్వకేట్లకు ఏం చేశారని ప్రశ్నించారు. RMP,PMP లు ఉద్యమంలో, రాష్ట్ర అభివృద్ధి సహకారం అందించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అండగా నిలవాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిని తెరిచేందుకు సీఎం ఒకే చెప్పారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. స్కూల్ వెహికిల్స్ కు ట్యాక్స్ రద్దు చేశామని గుర్తు చేశారు.