నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో గవర్నమెంట్ టీచర్, అంగన్వాడీ టీచర్ మధ్య సోమవారం గొడవ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెంకటాపురం ప్రైమరీ స్కూల్కు ప్రీ ప్రైమరీ స్కూల్ను మంజూరు చేసింది. అందులో సరిపడా స్టూడెంట్స్ లేకపోవడంతో పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ పిల్లలను ప్రీ ప్రైమరీ క్లాస్రూంలో కూర్చోబెడుతున్నారు.
ఈక్రమంలో అంగన్వాడీ టీచర్ ఉమాదేవికి ఐసీడీఎస్ సూపర్వైజర్ షోకాజ్నోటీసు జారీ చేస్తానని చెప్పారు. దీంతో స్కూల్ హెచ్ఎంశ్రీనివాస్ వద్దకు వెళ్లి తమ స్టూడెంట్స్ను అంగన్వాడీ సెంటర్కు పంపించాలని చెప్పినా పట్టించుకోలేదు. ఈక్రమంలో సోమవారం అంగన్వాడీ టీచర్, హెచ్ఎంమధ్య గొడవ జరిగింది. స్కూల్, అంగన్వాడీసెంటర్లోని రిజిస్టర్లలో ఒకే పేర్లు ఉన్నాయి. ఆఫీసర్లు జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
