- ఈ నెల 20న వర్చువల్ గా హాజరుకానున్న మంత్రి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్ సదస్సులో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ను హార్వర్డ్ కోరింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, టర్బో ఛార్జింగ్ ఇండియా అనే అంశాలపై ప్రసంగించాలని కేటీఆర్ను హార్వర్డ్ కోరింది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈనెల 20న జరగనున్న ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ వర్చువల్గా పాల్గొని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సదస్సులో ఆయన ప్రాతినిథ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నిర్వాహకులు తెలుపగా.. మంత్రి కేటీఆర్ సైతం అదే ఉత్సాహాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Look forward ? https://t.co/Pgb4E8wjgF
— KTR (@KTRTRS) February 18, 2022
మరిన్ని వార్తల కోసం:
ప్రముఖ నటుడి సెకండ్ మ్యారేజ్
పవన్ మూవీ షూట్ కంప్లీట్