పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ఇండియా అమ్మాయి అయిన సానియా మీర్జాను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పాక్ క్రికెటర్ కూడా మన దేశ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. పాక్ పేస్ బౌలర్ హసన్ అలీ ఈ నెల 20న పెళ్లి చేసుకోబోతున్నాడు. షోయాబ్ సానియా మీర్జాను పెళ్లాడితే..ఈ క్రికెటర్ సామియా అర్జూను వివాహం చేసుకోనున్నాడు. భారతీయురాలైన సామియా అర్జూ అనే యువతిని అతను పెళ్లాడబోతున్నానని తెలిపాడు హసన్. తన పెళ్లికి టీమిండియా ప్లేయర్లను పిలుస్తానని తెలిపాడు.
అలీకి కాబోయే భార్య ఢిల్లీకి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు. సామియా మాత్రం దుబాయ్ లోని ఎమిరేట్స్ విమాయాన సంస్థలో ఫ్లైట్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం హసన్ అలీని కలవడంతో ఇద్దరూ ప్రేమించుకొన్నారని తెలుస్తోంది. ఇరు కుటుంబాల్లో అంగీకారం తెలపడంతో తాము పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపాడు.
పెళ్లి ఆగస్టు 20న దుబాయ్ లో జరగనున్నట్లు చెప్పాడు.