వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ కరోనాతో పోరాటం చేయాల్సిందే: మోడీ

వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ కరోనాతో పోరాటం చేయాల్సిందే: మోడీ

కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ దేశం కరోనాతో పోరాటం చేయాల్సిందేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం క్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నా సరే… దేశమేమీ ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఇవాళ(గురువారం, జులై-23) మణిపూర్‌లో నీటి సరఫరా ప్రాజెక్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈశాన్య భారతం ఒకే సమయంలో రెండు సమస్యలతో పోరాడుతోందన్నారు ప్రధాని మోడీ. ఇందులో ఒకటి కరోనా కాగా, మరొకటి వరదలు అని అన్నారు. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని, చాలా మంది ప్రజల జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం వారి వెంటే ఉందన్నారు. ఎవరూ దిగులు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు మోడీ.