ఢిల్లీ వైరల్ వీడియోపై యువతి క్లారిటీ

ఢిల్లీ వైరల్ వీడియోపై యువతి క్లారిటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ రోడ్డుపై ఓ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించి కొట్టిన ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ఘటనపై బాధిత యువతే మంగళవారం క్లారిటీ ఇచ్చింది. తనను కారులోకి బలవంతంగా ఎక్కించిన వ్యక్తి తనను పెండ్లి చేసుకోబోయేవాడేనని సోషల్ మీడియా ద్వారా వివరించింది. ఓ విషయంలో తమ మధ్య వివాదం మొదలైందని, ఇప్పుడు అంతా సెట్​రైట్ అయిపోయిందని చెప్పింది. ఈ ఘటనపై వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకూ ఆమె థ్యాంక్స్ చెప్పింది. 

రెండ్రోజుల కింద జరిగిన ఈ ఘట న వీడియో వైరల్ అయింది. నడిరోడ్డులో ఓ వ్యక్తి యువతిని కొడుతూ కారులోకి ఎక్కించడం, పక్కనే ఉన్న యువకులు అడ్డుకోకపోగా అంతాకలిసి ఆమెను క్యాబ్​లో ఎక్కించడం అక్కడున్న అందరినీ భయాందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఢిల్లీలో మహిళల సేఫ్టీపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు.