మరింత విషమంగా మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం

మరింత విషమంగా మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం

ఇటీవల వరంగల్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది డాక్టర్లు వెల్లడించారు. ప్రీతికి ఇంకా ఎక్మో వెంటిలెటర్ పైనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం ఆమెకు చికిత్స నడుస్తోందని డాక్టర్లు చెప్పారు. తమ వద్ద ఉన్న మల్టీ డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో  చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇక ఆత్మహత్మాయత్నానికి ముందు ప్రీతి, తన తల్లితో ఫోన్ సంభాషణ అత్యంత చర్చనీయాంశంగా మారింది. సీనియర్లంతా ఒక్కటయ్యారని, సైఫ్ తనను ఏమైనా చేస్తాడని భయంగా ఉన్నట్టు ప్రీతి ఫోన్లో తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయడంతో హెచ్ఏడీ ఎందుకు ఫిర్యాదు చేశావంటూ ప్రశ్నించాడని తెలిపింది. ఆ తర్వాత సైఫ్ ను పిలిపించి వాళ్లు మాట్లాడారన్న ప్రీతి.. అతనితో ఏం మాట్లాడారో మాత్రం తనకు తెలియదని తన తల్లికి చెప్పుకుని బాధపడింది.