హెల్త్‌‌ ఇన్సూరెన్స్ లు నడుస్తలేవ్ ..కరోనా కవచ్‌ లు కూడా తీసుకోవట్లేదు

హెల్త్‌‌ ఇన్సూరెన్స్ లు నడుస్తలేవ్ ..కరోనా కవచ్‌ లు కూడా తీసుకోవట్లేదు
  • ముందుగా లక్షలు కడితేనే చేర్చుకుంటున్నరు
  • రాష్ట్రంలో కరోనా పేషెంట్ల అవస్థలు
  • హెల్త్ పాలసీలు వేస్ట్‌‌‌‌ అవుతున్నాయని జనం గోస
  • ఐఆర్‌‌‌‌డీఏఐ చెప్పినా వినని ప్రైవేట్ హాస్పిటళ్ళు

కరోనా సోకితే.. ఆ వైరస్ కు కాకుండా ట్రీట్ మెంట్ ఖర్చుకు భయపడాల్సిన పరిస్థితి. చేతిలో లక్షలు ఉంటే కానీ ప్రైవేటు దవాఖాన్లలో చేర్చుకోవడం లేదు. ముందుగా అమౌంట్ కడితేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉన్నోళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ‘నో ఇన్సూరెన్స్’ అని ముందే చెప్పేస్తున్నాయి ఆస్పత్రులు. దీంతో ఇన్సూరెన్స్ కోసం కట్టిన వేల రూపాయలు వేస్ట్ అవుతున్నా యని, ట్రీట్ మెంట్ కోసం లక్షలు తీసుకురాలేకపో తున్నామని బాధితులు వాపోతున్నారు.

‘క్యాష్‌ పేమెంటే కదా’…

కరోనా వచ్చి ప్రైవేటు హాస్పిటల్‌కు పోతే లక్షల రూపాయలు చేతిలో ఉంచుకోవాల్సిందే. ఎక్కడా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు చెల్లడం లేదు. అడ్మిట్‌ చేసుకునే ముందే హాస్పిటళ్లు చెప్పేస్తున్నాయి. ‘క్యాష్‌ పేమెంటే కదా’ అని సిబ్బంది అడుగుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌ అని చెబితే తిప్పి పంపుతున్నారు. కొందరు డైరెక్ట్‌గా ‘నో అడ్మిషన్‌’ అని చెబుతుంటే, మరికొందరు ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. హాస్పిటల్‌లో చేరితే రోజుకు 50 వేల నుంచి రూ.లక్ష పైనే ఖర్చవుతుందని కూడా చెప్పేస్తు న్నారు. దాంతో రూ.వేలు కట్టి ప్రీమియంలు చెల్లించి బీమా తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోందని జనం ఆవేదన చెందుతున్నారు. ఇన్సూరెన్సులు యాక్సెప్ట్‌ చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా) హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఇన్సూరెన్స్‌ లు అంగీకరిం చడం లేదని కొందరు పేషెంట్ల బంధువులు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా అటు నుంచి కనీస స్పందన లేదు.

ఆపతి వచ్చినప్పుడు ఆదుకుంటదని..

దేశంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లు ఇచ్చే కంపెనీలు 30 వరకు ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో కూడా పాలసీలు చేయిస్తుంటాయి. అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ల నుంచి మొదలుకొని కొన్ని సాధారణ రోగాలు, సర్జరీలు అవసరమైనా ఈ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉపయోగపడతాయి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో, పిల్లలకు కూడా ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉండే ఫ్యామిలీ ప్యాకే జీలు ఉంటాయి. దాంతో చాలా మంది ముందు జాగ్రత్తగా పాలసీలు తీసుకుంటారు. వ్యక్తుల ఏజ్‌ ప్రకారం పాలసీల ప్రీమియం ఉంటుంది. నలుగురు సభ్యుల ఒక సాధారణ కుటుంబం హెల్త్‌ పాలసీ తీసుకుటే ఐదు లక్షల ప్యాకేజీకి 25–30 వేల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

కొవిడ్ ప్యాకేజీలు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ తీసుకోని వాళ్ల కోసం ‘కొవిడ్‌ ప్యాకేజీలు’ తయారు చేయాలని అన్ని కంపెనీలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. దీంతో చాలా కంపెనీలు పాలసీలతో ముందుకు వచ్చాయి. కరోనా కవచ్‌ పేరుతో రూ.లక్ష నుంచి ఐదు లక్షల వరకు ప్యా కేజీలు తయారు చేశాయి. మూడున్నర, ఆరున్నర, తొ మ్మిదిన్నర నెలల పీరియడ్‌తో రూ.వెయ్యి, 2 వేల ప్రీమి యంతోనే రూ.2 లక్షల నుంచి ఐదు లక్షల ప్యాకేజీలు తయారుచేశాయి. తక్కువే కావడంతో చాలా మంది ఈ పాలసీలు తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీలు పాత పాలసీలకే అదనంగా కొంత ప్రీమియం చార్జ్‌చేసి అందులో కొవిడ్‌ను చేర్చాయి. మరికొన్ని కంపెనీలు పాత పాలసీలకే ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందు కు ఒప్పుకుంటున్నాయి. కానీ హాస్పిటళ్లు ఎట్లాంటి బీమాను యాక్సెప్ట్‌చేయట్లేదు. చిన్న చిన్న నర్సింగ్‌ హోమ్లే అంగీకరిస్తున్నాయి. కొందరు ముందు ఏపీలో 8,012 కేసులు పైసలు కట్టి తర్వాత క్లెయిమ్ చేసుకోమంటున్నారు.

ఆస్పత్రులు ఒప్పుకుంటలే..

అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ. 2 వేల నుంచి 3 వేల ప్రీమియంతో రూ. 5 లక్షల కరోనా కవరేజ్ ఇస్తున్నాయి. కానీ ప్రైవేట్ హాస్పిటళ్ల తీరుతో ప్రజలకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ దక్కట్లేదు.క్యాష్‌ లెస్‌ ట్రీట్‌మెంట్‌ కు చాలా హాస్పిటల్స్‌ ఒప్పుకోవడం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా డబ్బు కట్టి ట్రీట్‌మెంట్ చేయించుకో వాలంటున్నాయి. అందుకే మా కస్టమర్లకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నం. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

– బుద్ధార్థి వెంకటేశ్‌, సేల్స్ మేనేజర్‌‌, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

కొన్ని హాస్పిటళ్లు డబ్బుల ఆశతో ఇన్సూరెన్స్‌ కార్డు లను పట్టించుకుంటలేవు. ఇన్సూరెన్స్ కార్డు ఉందన్న ధైర్యంతో ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్తున్నవాళ్లను చేర్చుకోవడం లేదు. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎంతో మందితో పాలసీలు చేయించా. కానీ ఎన్నడూ ఇలా జరగలేదు. కరోనా సమయంలో పేషెంట్లను ఇబ్బందులు పెట్టకుండా చూడాలి. ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌ ఉండాలి. చర్యలు తీసుకోవాలి.

-ఇ.సురేష్ కుమార్, ఇన్సూరెన్స్ అడ్వైజర్