దిశ ఎన్ కౌంటర్ కేసు: జూన్ 21కి వాయిదా వేసిన హైకోర్టు

దిశ ఎన్ కౌంటర్ కేసు: జూన్ 21కి వాయిదా వేసిన హైకోర్టు

దిశ ఎన్ కౌంటర్ కేసులో   సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది.  ప్రభుత్వం తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసులిచ్చింది. తమ వాదనలు వినిపించాలని నోటీసులో పేర్కొంది.  ఎన్ కౌంటర్ సమయంలో సీపీగా ఉన్న ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నోటీసు అందుకున్నారు.

మరోవైపు ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్ట్ ను కోరామని పిటిషనర్ తరపు లాయర్ వెల్లడించారు. ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు లాయర్ కృష్ణమాచార్య తెలిపారు.  నష్టపరిహారం అంశంలో హైకోర్టు సానుకూలంగా ఉందన్నారు.. దిశ కేసు తుది ఘట్టానికి  చేరుకుందని..మరో రెండు వాయిదాల్లో ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ కేసు  తదుపరి విచారణను హైకోర్టు  జూన్ 21కి వాయిదా వేసిందని వెల్లడించారు.