రాష్ట్రంలో అలా చిరుజల్లు కురిశాయో లేదో ఇలా మాడు పగిలే ఎండలు కొట్టే రోజులు వచ్చాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ దాటడంతో వేడిగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, మహబూబాబాద్ జిల్లాలోని అయ్యగారిపల్లె మరియు గార్ల, సూర్యాపేటలోని మునగాల, నల్గొండలోని నాంపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురంలో గరిష్ట ఉష్ణోగ్రత 44.7 డిగ్రీల సెల్సియస్తో రెండవ స్థానంలో ఉన్నాయి.
ఈరోజు అంటే 2024, ఏప్రిల్ 18న కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనావ వేసింది వాతావరణ శాఖ.
Also Read:ఇప్పుడు భారత్ జనాభా ఎంతో తెలుసా.. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్
రేపు అనగా 2024, ఏప్రిల్ 19న నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండ ఎక్కువగా కొట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో సాయంత్రం వరకు వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మేఘావృతమైన వాతావరణం, గాలులు వీచే వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.