భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో వస్తున్న భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని వేములవాడ, కాళేశ్వరం ఆలయాలు, ఏపీలోని  అమరావతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీశైలంలో రాత్రి పది గంటల నుంచి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాకల్యాణం నిర్వహించనున్నారు. రాత్రి పన్నెండు గంటలకు భ్రమరాంబికాదేవి-మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుంది. శ్రీశైలంలో రద్దీ కారణంగా  ఆలయ ప్రధాన రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి.