
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సోమవారం ఉదయం స్వామివారి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానమాచరించారు.
అనంతరం స్వామివారిని దర్శించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటలు పట్టించని భక్తులు తెలిపారు. స్వామివారి ప్రసాదం, కోడెల టికెట్ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. మరో వైపు వేములవాడ అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది.