నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద..26గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద..26గేట్లు ఎత్తివేత

నల్లగొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ జలాశయానికి జలకళ వచ్చింది. జలాశయం నిండుకుండలా తలపిస్తోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 2లక్షల59వేల 610 క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో  అంతే స్థాయిలో ఉంది. శనివారం (సెప్టెంబర్13) సాయంత్రానికి ప్రాజెక్టు 26 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు 2లక్షల59వేల 610 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 

 నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 589.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 310.5510 టీఎంసీలుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. 

►ALSO READ | ఆ ముగ్గురు దోచుకున్న సొమ్ము కోసం లొల్లి పెట్టుకుంటున్నరు : మంత్రి వివేక్ వెంకటస్వామి

పైనుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. సాగర్ జలాశయ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ డ్యాం పరిసరాల్లో సందడి నెలకొంది.