
వేములవాడ, వెలుగు: రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మంగళవారం 6 కోడెలు చనిపోయినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గోశాలలో 26 పశువులు చనిపోయాయని, మరో 4 కోడెలు అనారోగ్యం పాలయ్యాయని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న కోడెలకు వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ నుంచి ప్రత్యేక వైద్య బృందం కోడెలకు మెరుగైన వైద్యం అందిస్తోందని చెప్పారు. చిన్న, పెద్ద వయసు కోడెలు ఒకేచోట ఉండడంతో చనిపోతున్నాయని తెలిపారు. భక్తులు ఏడాదిన్నర వయసు కంటే ఎక్కువ ఉన్న కోడెలను మాత్రమే ఆలయానికి సమర్పించాలని ఆయన సూచించారు.