
- 100 కోడెలను పంపిణీ చేసిన ఆఫీసర్లు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న గోశాలలోని కోడెలను శుక్రవారం రైతులకు పంపిణీ చేశారు. కోడెలు అవసరమైన రైతులు అప్లికేషన్లు చేసుకోగా.. వాటిని పరిశీలించిన ఆఫీసర్లు అర్హులైన వారిని ఎంపిక చేసి 100 కోడెలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ ---కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కోడెలను వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు మొత్తం 750 కోడెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.