గోపాలపట్నం గ్యాస్ ప్రమాద బాధితుల కోసం హెల్ప్ లైన్

గోపాలపట్నం గ్యాస్ ప్రమాద బాధితుల కోసం హెల్ప్ లైన్

విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్.జీ. పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకై ఇప్పటికే 9మంది చనిపోయారు. దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. స్టైరిన్ గ్యాస్ వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకడంతో అక్కడి ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఊర్లు ఖాళీ చేస్తున్న బాధితుల కోసం సింహాచల దేవస్థానం కొన్ని 40 రూంలతో పాటు మూడు మండపాలను కూడా కేటాయించింది. వసతి సౌకర్యం కావలసిన వారు 9912305512 నెంబరుకు ఫోన్ చేయాలని దేవస్థాన కమిటీ సూచించింది.