ట్యాంక్బండ్, వెలుగు: ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా హేమా సుదర్శన్ జిల్లోజు నియమితులయ్యారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ హేమకు గురువారం నియామకపత్రం అందజేశారు. పార్టీ వర్కింగ్ కన్వీనర్గా బుర్ర రాము గౌడ్, కో కన్వీనర్గా శైలు, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ ఎస్కేఆర్ అన్సారి, ట్రెజరర్గా మమ్మద్ సోహెల్, జాయింట్ సెక్రటరీగా సయ్యద్ హైదర్, జాయింట్ ట్రెజరర్గా జావిద్ షరీఫ్ నియమితులయ్యారు.
