విడాకుల వార్తల పై స్పందించిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

విడాకుల వార్తల పై  స్పందించిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

తెలుగు సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారంటూ గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వార్తల పైన ఇద్దరు రియాక్ట్ కాకపోవడంతో ఆ వార్తలకు మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది.   ఈ క్రమంలో విడాకులు వార్తల పై ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా పరోక్షంగా స్పందించింది ఈ జంట. కొద్దిరోజులుగా తన యూట్యూబ్ వ్యూస్ , ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ బాగా పెరిగారని చెప్పుకొచ్చింది శ్రావణ భార్గవి.  తాను చేసే పని కంటే ఇప్పుడు ఎక్కువ పని లభిస్తోందని, గతంలో సంపాదించే దానికంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించే అవకాశం దొరికిందని తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమే అన్న శ్రావణ భార్గవి .. తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదం అని వెల్లడించింది.  ఇది నా రాండమ్ థాట్ అంటూ ఈ పోస్ట్ ను తన భర్త హేమచంద్రకు ట్యాగ్ చేసింది. దీనిపైన హేమచంద్ర స్పందిస్తూ రివర్స్ లో ఓ పోస్ట్  పెట్టాడు. ఎవరైతే తమ సమయాన్ని వృథా చేసుకోవాలనుకుంటున్నారో, తమ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టాలి అనుకుంటున్నారో వారికోసమే ఈ పోస్టు అంటూ తెలిపాడు.  సోషల్ మీడియాలో ఆ పోస్ట్ లు వైరల్ గా మారాయి.  కాగా హేమచంద్ర, శ్రావణ భార్గవి ఫిబ్రవరి 14, 2013న వివాహం చేసుకోగా వీరికి షికారా చంద్రిక అనే పాప జన్మించింది. ఇద్దరు సింగర్స్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. సింగర్స్ గానే కాకుండా గతంలో ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో 'బోల్ బేబీ బోల్'కి హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.