రిలీజ్ ముందు ఇదేం లొల్లి.. మండిపడుతున్న అజిత్ ఫ్యాన్స్

రిలీజ్ ముందు ఇదేం లొల్లి.. మండిపడుతున్న అజిత్ ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రాగా.. థియేటర్ లో సినిమా చూసేందుకు ప్రేక్షకులను అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. 

అయితే తాజాగా భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ పై తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  భోళా శంకర్ సినిమా.. అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల భోళా ప్రమోషన్స్ లో భాగంగా వేదాళం గురించి మాట్లాడిన దర్శకుడు మెహర్ రమేష్.. వేదాళం సినిమాలో చాల క్రింజ్(అనవసరమైన) షాట్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని భళా కోసం మార్చేసాం. ఈ సినిమాలో మీకు అలాంటి ఫీలింగ్ కలగదు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ మెహర్ రమేష్ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించారు మెహర్ రమేష్.

నాకు వేదాళం సినిమా చాల నచ్చింది. ఆ కథ రాసినందుకు దర్శకుడు శివను అప్రిషియేట్ కూడా చేశాను. అన్నా చెల్లెళ్ళ బంధాన్ని ఆయన చూపించిన తీరు అద్భుతం. దానిని తెలుగు ప్రేక్షకులకు చుపించాలనుకున్నాను. 2009లో అజిత్ మూవీ బిల్లాని ప్రభాస్ తో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వేదాళం రీమేక్ తో చిరంజీవి సార్ కు హిట్ ఇవ్వడానికి మరో రెండు రోజుల్లో మీ ముందుకు వస్తున్నాను అంటూ రాసుకొచ్చారు మెహర్ రమేష్. ఇక ఇది చుసిన మెగా ఫ్యాన్స్ రిలీజ్ ముందు ఏంటి ఈ లొల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.