కరోనా ఎవరినీ వదలట్లేదు. గత రెండు సంవత్సరాల నుంచీ ప్రజలతో ఆడుకుంటూ... తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తోంది. ఈ మధ్యే కాస్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే.. ఇటీవలి కాలంలో దేశంలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే.. కరోనా మళ్లీ తిరబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ హీరోలకు, సెలబ్రెటీలకు పాజిటివ్ గా నిర్థరణ అవుతోంది. కాగా తాజాగా మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు ప్రముఖ యంగ్ హీరో, అశోక్ గల్లా కూడా కరోనా బారిన పడ్డట్టు సమాచారం. ఈ వార్తను స్వయానే ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. స్వల్ప లక్షణాలున్నాయన్న ఆయన.. త్వరలోనే సాధారణ స్థితిలోకి వస్తానని.. తనను ఈ మధ్యకాలంలో కలిసిన వారందరూ కూడా కరోనా టెస్ట్ చేయించాలని కోరారు. విక్రమ్, మేజర్ సినిమాలను మిస్ కావడం బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అంటూ ట్వీట్ చేశారు.
తొలి మూవీ హీరో తోనే సక్సెస్ను నమోదు చేసుకున్న అశోక్... బెస్ట్ రేటింగ్ను కూడా సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అశోక్.. హీరో మంచి విజయం సాధించగా,... మళ్లీ ఎలాంటి మూవీతో వస్తాడోనని ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Hi everyone, I have tested positive for Covid, fortunately it’s a mild strain and should be back to normal soon. All those who have been in contact with me last couple of days please get tested. Being a movie buff my biggest disappointment is missing #vikram and #Major ? TC all!
— Ashok Galla (@AshokGalla_) June 6, 2022
మరిన్ని వార్తల కోసం...