
హనుమాన్(HanuMan) చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే.. ఆ హనుమంతుడే మమ్మల్ని ముందుకు నడుపుతున్నారనిపిస్తోంది అన్నాడు తేజ సజ్జా(Teja Sajja). ప్రశాంత్ వర్మ(Prashanth varma) దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి(K Niranjan reddy) నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా తేజ సజ్జా చెప్పిన విశేషాలు. ‘‘ఈ చిత్రాన్ని విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇతర భాషల నుంచి కూడా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ రావడం సర్ప్రైజింగ్గా ఉంది. ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలియకపోయినా వారి నుంచి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తోంది.
ప్రశాంత్ వర్మ విజన్పై అందరం నమ్మకం పెట్టుకున్నాం. పండగకే కాదు.. లాంగ్ రన్ ఉండే చిత్రమని బలంగా నమ్మాం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రతి ఆటకి థియేటర్స్ పెరుగుతున్నాయి. ‘హను మాన్’ నా కెరీర్లోనే బెంచ్ మార్క్గా నిలిచిపోతుంది. మా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రాజెక్టు మొదలు నుంచి కాన్ఫిడెంట్గానే ఉన్నారు. బడ్జెట్ పెరిగినా ఏమాత్రం ఆలోచించలేదు. చిన్న చిత్రంగా మొదలై పాన్ ఇండియా రేంజ్లో విజయం పట్ల టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. సినిమా ఫుల్ రన్ అయ్యేవరకు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని నేను కూడా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టుకు కమిట్అయ్యి ఉన్నాను.
యాక్షన్ స్టంట్స్తో సహా ఇందులో అన్నీ ఒరిజినల్గా చేసినవే. అండర్ వాటర్ సీక్వెన్స్, క్లైమాక్స్లో గాల్లో ఉండే సీక్వెన్స్ ఇవన్నీ రియల్గా చేశాం. ఇందులో హనుమాన్ విగ్రహం చూసినప్పుడల్లా చాలా దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఆ విగ్రహం కోసం ఆరు నెలల సమయం తీసుకున్నాం. ఈ జర్నీతో నేను ఓపికగా ఉండటం నేర్చుకున్నా. హను మాన్ పార్ట్2 ను త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం ఓ కొత్త సినిమాలో నటిస్తున్నా. త్వరలోనే దాన్ని అనౌన్స్ చేస్తాం’’.