హిడింబ రిలీజ్ కు లైన్ క్లియర్.. 

హిడింబ రిలీజ్ కు లైన్ క్లియర్.. 

అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత హీరోయిన్. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 20న విడుదల చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఇందులోని కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న సెన్సార్ వారు.. రివ్యూ కమిటీ ద్వారా రీ- సెన్సార్ చేసి ఆమోదించారు. దీంతో సినిమా రిలీజ్‌‌కి లైన్ క్లియర్ అయ్యింది. ఇంతకు ముందెవరూ టచ్ చేయని జానర్‌‌‌‌లో తీశామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. శ్రీనివాస రెడ్డి, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వికాస్ బాడిశ సంగీతం అందించాడు.