
విచారణ టైమ్లో హైకోర్టు సీజే కామెంట్
తాను బదిలీపై వెళ్తున్నానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఫౌంహౌస్ కేసును లోతుగా విచారించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అన్నారు. తాను త్వరలో బదిలీ కాబోతున్నానని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ వివాదంపై ఫైల్ అయిన పిటిషన్ పై హైకోర్టు సీజే ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మంత్రి కేటీఆర్ రూల్స్ కు విరుద్ధంగా ఫౌంహౌస్ కట్టారని ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించగా, దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసిన ఎన్జీటీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే ఎన్జీటీ ఆదేశాలపై స్టే విధిస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ స్టేను ఎత్తేయాలని రేవంత్ తరఫు లాయర్ కోరారు. ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని, తాను త్వరలో బదిలీ అవుతున్నందున… ఇప్పుడే స్టే ఎత్తివేసి, విచారణ చేసేందుకు టైమ్ లేదని సీజే బదులిచ్చారు. విచారణను జనవరి 6కి వాయిదా వేశారు.
For More News..