మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై పిటిషన్ డిస్మిస్

మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై పిటిషన్ డిస్మిస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్​పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. నామినేషన్ సందర్భంగా మంత్రి దాఖలు చేసిన అఫిడవిట్​పై మహబూబ్ నగర్​కు చెందిన రాఘవేంద్ర రాజు అభ్యంతరం తెలిపారు.

శ్రీనివాస్ గౌడ్ తన వివరాలను తప్పుగా సమర్పించినట్లు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు.. పిటిషన్​ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.