Farm house case : సిట్ నోటీసులపై స్టే పొడిగింపు

Farm house case : సిట్ నోటీసులపై స్టే పొడిగింపు

 ఫాంహౌస్ కేసులో నిందితుల సిట్ విచారణపై హైకోర్టు స్టే పొడిగించింది. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్కు సిట్ CRPC 41A కింద జారీ చేసిన నోటీసులపై స్టేను 23 వరకు పొడిగించింది. అయితే ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టాలని ఆదేశించినందున స్టే పొడిగిచండం ఎందుకు అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. 

అయితే సీబీఐ విచారణ తీర్పు కాపీ ప్రభుత్వం తీసుకునే వరకు అమలు సస్పెన్షన్లో ఉంటుంది కాబట్టి స్టే పొడిగించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనకు హైకోర్టు అంగీకరిస్తూ.. సిట్ విచారణపై స్టేను పొడిగించింది. గతంలో ఇచ్చిన స్టే డిసెంబర్ 30తో ముగిసింది.