బతుకమ్మ కుంట ప్రభుత్వానిదే సింగిల్‌‌‌‌‌‌‌‌

బతుకమ్మ కుంట ప్రభుత్వానిదే సింగిల్‌‌‌‌‌‌‌‌
  • జడ్జి తీర్పును రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బాగ్‌‌‌‌‌‌‌‌అంబర్‌‌‌‌‌‌‌‌పేటలోని సర్వే నెం 563/1లో గల 988, 983, 1925 చదరపు మీటర్ల మూడు స్థలాలు రాష్ట్ర సర్కారువేనని హైకోర్టు తీర్పు చెప్పింది. అందులోని బతుకమ్మకుంట, మిలిగిన స్థలం సయ్యద్‌‌‌‌‌‌‌‌ జహంగీర్‌‌‌‌‌‌‌‌ తో పాటు ఇతరులదని సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పును సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను ఆమోదిస్తూ చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్​ఇటీవల తీర్పు చెప్పింది. 

ఆ స్థలంపై యాజమాన్య హక్కులు తమవేనని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులు భావిస్తే సంబంధిత సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టులో దావా వేసుకుని ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది, అది ప్రభుత్వ స్థలమేనని రాష్ట్ర సర్కారు చేసిన వాదనను ఆమోదించింది.