ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా ప్రభుత్వం స్పందిచడం లేదు. మరోవైపు కార్మికులు సమ్మె చేపట్టి ఇవాళ్టికి 52 రోజులు అవుతోంది. దీంతో ఆర్టీసి కార్మికుల వేతనాల పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఏజి అందుబాటులో లేరని…మరికొంత సమయం కావాలని ఆర్టీసి స్టాండింగ్ కౌన్సిల్ కోర్టును కోరింది. జీతాల్లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, కార్మికుల్లో ఇప్పటివరకు 30 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని కోర్టుకు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం 27న పూర్తి వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.