
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు సీనియర్అడ్వకేట్ దామోదర్రెడ్డి కాంగ్రెస్పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఎలక్షన్ అబ్జర్వర్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాణిక్ రావు ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దామోదర్ రెడ్డి సేవలను కచ్చితంగా ఉపయోగించుకుంటామని, ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ఠాక్రే హామీ ఇచ్చారు.