హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సజావుగా సాగుతున్నాయి. సిమ్లాలోని రాంపూర్లో ఆ రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా తాము 40 నుంచి 45 సీట్లు దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ అభివృద్ధి కోసం పని చేస్తుందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలదని చెప్పారు.
అంతకు మునుపు హిమాచల్ ప్రదేశ్ లోని చాలా మంది కాంగ్రెస్ నేతలు తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ తనకు ఆ కోరిక లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చాలా మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తనకు మాత్రం అంత ఆసక్తి లేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్, ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆమె అన్నారు.