హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్..ఆకస్మిక వరదలు..కులు జిల్లాలో తీవ్రనష్టం

హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్..ఆకస్మిక వరదలు..కులు జిల్లాలో తీవ్రనష్టం

క్లౌడ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. బుధవారం హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ తో ఆకస్మిక వరదలు సంభవించాయి. ముఖ్యంగా కులూ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. నదులు, వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

కుల్లు జిల్లాలోని సైంజ్ వ్యాలీలోని జీవా నాలా (Jeeva Nala) ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో జీవా నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. రెస్క్యూ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మాణికరన్ వ్యాలీలో  బ్రహ్మ గంగా నది ఉప్పొంగి ఆకస్మిక వరదలు వచ్చాయి.  సైంజ్, గడ్సా, సోలంగ్ నాలా (Solang Nala) ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్‌లు నమోదయ్యాయి. 

A cloudburst in Sainj Valley of Kullu district has triggered a sudden surge in a stream.

If you’re in the area, please stay alert and take necessary precautions. pic.twitter.com/Q8U6kdWJHs

— Go Himachal (@GoHimachal_) June 25, 2025

క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి ఆటో-లూహ్రి-సైంజ్ జాతీయ రహదారి బ్లాక్ అయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇద్దరు మంత్రులు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. 

ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

►ALSO READ | ఈ అమ్మాయి ఎంతకు తెగించింది : పెళ్లి చేసుకోవటం లేదని.. అబ్బాయి పేరుతో 11 రాష్ట్రాలకు బెదిరింపులు..!

కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, చిన్న వంతెనలు కూడా దెబ్బతిన్నాయి.నదులు, వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.రాష్ట్రంలో తదుపరి 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా క్లౌడ్ బరస్ట్‌లు ,ఆకస్మిక వరదలు తరచుగా సంభవిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవనానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.