
దేవుడా.. ఓరి దేవుడా.. ఏంటీ ఈ అమ్మాయిలు ఇలా ఉన్నారు అనే రోజులు వచ్చేశాయి.. ఇష్టం లేని పెళ్లి చేస్తే.. పది రోజుల్లోనే మొగుడిని లేపేస్తున్నారు.. ప్రేమ గీమా ఏంటీ అని పేరంట్స్ తిడితే వాళ్లను చంపేస్తున్నారు.. నిన్నటికి నిన్న ఫస్ట్ నైట్ రోజు టచ్ చేస్తే.. ముక్కలుగా నరుకుతా అని వార్నింగ్ ఇచ్చిందో ఇంకో భార్య.. ఇలా ఒకటా.. రెండా.. ఎన్ని ఎన్నెన్ని ఘోరాలు చేస్తున్నారో తెలుసా.. లేటెస్ట్ గా.. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నై సిటీకి చెందిన యువతి.. ఓ అబ్బాయిని ప్రేమించింది.. పద్దతిగా పెళ్లి చేసుకోమని కోరింది.. ఆ అబ్బాయి మాత్రం నాకు నీ ప్రేమ వద్దు.. నీతో పెళ్లి వద్దు అని చెప్పాడు.. అంతే నేను అడిగితే పెళ్లి చేసుకోను అంటావా అంటూ.. ఆ అమ్మాయి ఏకంగా 11 రాష్ట్రాలకు చెమటలు పట్టించింది.. ఉరుకులు పరుగులు పెట్టించింది.. ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసుల వివరాల ప్రకారం. . రెనె జోషిల్డా అనే యువతి చెన్నైలోని ఇంజినీరింగ్ పూర్తి చేసి డెలాయిట్ లో సీనియర్ రోబోటిక్స్ కన్సల్టెంట్ గా పనిచేస్తోంది. కంపెనీ వర్చువల్ సమావేశాల మీటింగ్ ల సమయంలో దివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ప్రభాకర్ ను ప్రేమించింది. అయితే ఆమె ప్రేమను తిరస్కరించాడు ప్రభాకర్. దీంతో దివిజ్ తో కలిసి ఉన్నట్లుగా ఫోటోలు చిత్రీకరించి పెళ్లి చేసుకున్నామని వాళ్ల స్నేహితులకు పంపించి ప్రచారం చేసేది. దీనిపై ప్రభాకర్ చెన్నై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ప్రభాకర్ కు వేరే అమ్మాయితో పెళ్లి జరగబోతుందని తెలుసుకున్న జోషిల్డా. ఎలాగైనా ప్రభాకర్ పై పగ తీర్చుకోవాలనుకున్న జోషిల్డా దివిజ్ ప్రభాకర్ పేరుతో ఫేక్ ఈ మెయిల్ ఐడీలు సృష్టించింది.
ఫిబ్రవరి, జూన్ 2025 ప్రభాకర్ పేరుతో ఉన్న పేక్ ఈ మెయిల్ ఐడీ ఉపయోగించి గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతో సహా 11 రాష్ట్రాల్లోని పాఠశాలలు, స్టేడియంలు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపింది. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం, పాఠశాలలు, అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రులు వంటి ప్రదేశాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ పలు సంస్థలకు మొత్తం 21 ఈమెయిల్లను పంపింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో సైతం రెనే ఓ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్టు చేశామని అధికారులు తదుపరి దర్యాప్తు కోసం 11 రాష్ట్రాలకు సమాచారం అందిస్తున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సింఘాల్ తెలిపారు.
ఆమె తన మాజీ సహోద్యోగి దివిజ్ ప్రభాకర్ను ఇరికించడానికే ఇదంతా చేసింది, అతను ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అందుకే ఆమె ఇలా చేసిందని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు. జోషిల్దా గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనేక ఫేక్ ఐడీలను సృష్టించి తనకు పరిచయం ఉన్నవారిని చిలిపిగా, వేధించిందని సింఘాల్ అన్నారు. ఇటువంటి బెదిరింపు ఇమెయిల్లను పంపి మానసిక వేధింపులకు గురిచేసేదని చెప్పారు.