హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తెల్లవారు జామున భారీ వర్షాలు కారణంగా వరదలో ఇండ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. కులులోని పంచనాలలో వరదలతో ఐదు ఇండ్లు పూర్తిగాను, 15 ఇళ్లు పాక్షికంగాను ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. వరదలతో భుంతర్ గడ్సా , మణియార్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.
తెల్లవారు జామున కులు జిల్లాలో పార్వతి నదీ ఉప్పొంగడంతో మలానా హైడ్రో పవర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్ల పైనుంచి ప్రవహించి వరద నీరు మలానా గ్రామంలో చేరింది. మరోవైపు జూన్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.