గ్రేటర్ లో బీఆర్ఎస్ కు మరో షాక్

గ్రేటర్ లో బీఆర్ఎస్ కు మరో షాక్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో బీఆర్ఎస్​కు మరో షాక్ తగిలింది. హిమాయత్ నగర్ బీఆర్ఎస్​ కార్పొరేటర్ మహాలక్ష్మి, ఆమె భర్త రామన్ గౌడ్ తో పాటు గన్ ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మమత గుప్త కాంగ్రెస్ లో చేరారు. 

శనివారం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంట్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎంని కలిశారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు. సిటీ అభివృద్ధి కోసమే కాంగ్రెస్​ లో చేరినట్లు కార్పొరేటర్ మహాలక్ష్మి తెలిపారు.