- శుభ్రం చేయడానికి టెండర్లు ఆహ్వానించనున్న హెచ్ఎండీఏ
- మూడేండ్లు.. రూ. 7.11 కోట్ల ఖర్చు..
హైదరాబాద్సిటీ, వెలుగు :నగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్బండ్(హుస్సేన్సాగర్)లో వ్యర్థాల తొలగింపును హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇందులో భాగంగా హుస్సేన్సాగర్లోపల, బయట క్లీనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ రెండు డ్రిడ్జ్యుటిలిటీ క్రాఫ్ట్స్(డీయూసీ)లను ఉపయోగించి చెత్తను తొలగిస్తోంది. అలాగే, మూడు నెలలే క్లీన్చేయడానికి కంపెనీలకు బాధ్యతలు అప్పగిస్తుండడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో మూడేండ్ల కాలానికి సాగర్లో వ్యర్థాల తొలగింపు బాధ్యతలను రెండు కంపెనీలకు అప్పగించేందుకు హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు సిద్ధమయ్యారు. దీని కోసం టెండర్లు ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారు
అంతటా వ్యర్థాలే...
హుస్సేన్సాగర్వంద అడుగుల లోతు ఉండగా, 4.7 చ. కి.మీ.పరిధిలో నీళ్లు ఉన్నాయి. చుట్టుపక్కల దాదాపు 14.70 చ.కి.మీ మేర ఇది విస్తరించి ఉంది. రోజూ ట్యాంక్బండ్కు వచ్చే విజిటర్స్చిరుతిళ్లు తిని మిగిలిన వ్యర్థాలను, కవర్లను సాగర్లో పడేస్తున్నారు. సంజీవయ్య పార్క్, జలవిహార్, పీపుల్స్ప్లాజా, రాక్గార్డెన్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్మార్గ్, సెయిలర్స్క్లబ్, బోట్స్క్లబ్తదితర ప్రాంతాల వైపు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లోని సాగర్లో పడే నీళ్లలోని వ్యర్థాలు కుళ్లి తేలియాడుతున్నాయి. మరికొందరైతే ఇండ్లలోని పూజా సామగ్రి తెచ్చి పడేస్తున్నారు. దీంతో సాగర్చెత్తమయంగా మారింది.
రెండు సెక్టార్లుగా విభజన
హుస్సేన్సాగర్లోని చెత్త, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యర్థాలను తొలగించేందుకు ఆయా ప్రాంతాలను హెచ్ఎండీఏ రెండు సెక్టార్లుగా విభజించింది. ట్యాక్బండ్సాగర్పార్క్, బీపీపీ, లుంబినీ పార్క్, ఎన్టీఆర్మార్గ్, రోటరీ గార్డెన్, బ్రిడ్జి–1, సిద్ధార్థ పాండ్, బుల్కాపూర్నాలా నుంచి ఐఅండ్డీ కాలువ, పీపుల్స్ప్లాజా బ్రిడ్జి–2, బ్రిడ్జి–3 నుంచి జలవిహార్వరకు 6.47 కి.మీ పరిధిని సెక్టార్-1గా, జలవిహార్, అగరం పోచయ్య బ్రిడ్జి–4, పీవీ ఘాట్, సంజీవయ్య పార్క్, బ్రిడ్జి –5 పికెట్ నాలా ఐఅండ్డీ పికెట్నాలా వరకు, బుద్ధభవన్, దానిని ఆనుకుని ఉన్న వర్క్షాప్స్, సెయిలింగ్క్లబ్సర్ప్లస్వియర్అక్కడి నుంచి బతుకమ్మ ఘాట్వరకు మొత్తం 8.25 కి.మీలను సెక్టార్-2గా నిర్ణయించారు.
మూడు సంవత్సరాల టైం..
ట్యాంక్బండ్ లో వ్యర్థాల తొలగింపులో భాగంగా రెండు సెక్టార్లను రెండు కంపెనీలకు మూడేండ్లకు అప్పగించేందుకు ప్లాన్చేస్తోంది. ఒక్కో సెక్టార్లో దాదాపు 40 మంది కార్మికులు వ్యర్థాలు తొలగించేలా చూడనున్నారు. నీటి పై తేలియాడే చెత్తను, ప్లాస్టిక్కవర్లను తొలగించడానికి ఐదు పెడల్బోట్లను వినియోగించనున్నారు. ఒక్కోబోట్లో ముగ్గురు లేబర్లు ఉంటారు. ఈ వ్యర్థాలను తరలించేందుకు రెండు ఏజెన్సీలకు పనులు అప్పగిస్తారు. 14.70 చ. కి.మీ పరిధిలోని ట్యాంక్బండ్పరిసరాల్లోని ఇన్ఫ్లో ఛానెల్స్ బంజారా నాలా, బుల్కాపూర్నాలా, పికెట్నాలా, కూకట్పల్లి నాలాల నుంచి వచ్చే వ్యర్థాలనూ తీసేస్తారు.
సెక్టార్-1 పరిధిలో వ్యర్థాలను తొలగించేందుకు రూ.3.22 కోట్లు, సెక్టార్-2లో వ్యర్థాల తొలగింపునకు రూ.3.89 కోట్లు ఖర్చు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలే మూడేండ్ల పాటు సాగర్జలాల్లో వ్యర్థాలు పడకుండా, పరిసరాల్లో విజిటర్స్చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో టెండర్లను ఆహ్వానించి పనులను అప్పగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
