మోకిలా ఫేజ్‌-2లో మరో భారీ భూవేలానికి నోటిఫికేషన్‌

మోకిలా ఫేజ్‌-2లో మరో భారీ భూవేలానికి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ : కేసీఆర్ సర్కార్ భూములను వరుసగా అమ్ముతోంది. తాజాగా మరో భారీ భూవేలానికి సిద్ధమవుతోంది. మోకిలా ఫేజ్‌-2లో 300 ప్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 300 ప్లాట్లలో 98 వేల 975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. లేఅవుట్‌లో 300 నుంచి 500 గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 98 వేల 975 గజాల అమ్మకంతో రూ.800 కోట్లు ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 

వేలంలో పాల్గొనేందుకు ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. ఒక వెయ్యి 180 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. రిజిస్ట్రేషన్‌తో పాటు లక్షరూపాయలు డిపాజిట్‌ చేయాలని తెలిపింది. చదరపు గజానికి రూ.25 వేలు కనీస ధరగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. మోకిలా తొలి ఫేజ్‌ వేలంలో గరిష్ఠంగా గజానికి రూ.1.05 లక్షలు, కనిష్ఠంగా రూ.72 వేలు పలికిన విషయం తెలిసిందే.