
జీడిమెట్ల, వెలుగు: కుటుంబ కలహాలతో ఓ హోంగార్డు గొంతు కోసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన కరీంసూరారం సాయిబాబానగర్లో ఉంటూ 20 ఏండ్లుగా సైబరాబాద్పరిధిలోని పలు ప్రాంతాల్లో హోంగార్డుగా చేస్తున్నాడు. ప్రస్తుతం బాలానగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా నాలుగేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కారణంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయమై కుమారులు కరీంను నిలదీశారు.
దీంతో అతను తన పిల్లలు కొడుతున్నారని బుధవారం సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం కరీం భార్య, కొడుకులు పోలీస్స్టేషన్కు వచ్చారు. మాటామాటా పెరిగి గొడవ పడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతారేమోనన్న భయంతో కరీం బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. పోలీసులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. కరీంకు స్వల్ప గాయాలే అయ్యాయని వైద్యులు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.