
ఖైరతాబాద్లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సుమారుగా నాలుగు లైన్లలో భక్తులు క్యూలో ఉన్నారు. భక్తులను పోలీస్ సిబ్బంది కంట్రోల్ చేస్తున్నారు. మహా గణపతికి ఉదయం 11 గంటలకు తొలిపూజ జరిగింది. ఈ పూజలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు.. భారీ వినాయకుడి ప్రత్యేకతలు ఇవే
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు కావడంతో ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. . ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. కాగా ఈ సారి ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గణనాథుడు. స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు.