మాదాపూర్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు ఎస్వోటీ పోలీసులు. ఇద్దరు విద్యార్థుల నుంచి నాలుగు లక్షల విలువైన MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన ఇద్దరు విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. వీరిని అరెస్ట్ చేసి మాదాపూర్ పీఎస్ లో అప్పగించారు.