గజ్వేల్ లో ముదిరాజ్ ల భారీ ర్యాలీ

గజ్వేల్ లో ముదిరాజ్ ల భారీ ర్యాలీ

గజ్వేల్, వెలుగు: ‘ఓట్లు మావి.. సీట్లు మీకా..’ అని ముద్దిరాజ్​లు నిలదీశారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్​ లకు అనాదిగా చట్టసభల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ముదిరాజుల సంఘం నాయకులు గుంటుకు  శ్రీవాస్, పిట్లనగేశ్, భైరి శంకర్, పిట్ల ఆంజనేయులు, రాయపోల్ జడ్పీటీసీ లింగాల యాదగిరి, నాయకులు రమేశ్, భీమలక్ష్మాణ్, బి.నారాయణ, పడిగె ప్రశాంత్, మిట్టపల్లి శ్రీనివాస్, తొడంగి నవీన్, పుల్లూరు సుధాకర్  తెలిపారు. ఈ విషయమై బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ముదిరాజులు భారీ ర్యాలీ నిర్వహించారు.  

స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులకు చట్టసభల్లో రావాల్సిన రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేట కేటాయించకుండా ఓట్లు వేయించుకొని రాజకీయ పార్టీలు గద్దెకెక్కుతున్నాయన్నారు. 18 ఏండ్లు నిండిన యువకులకు మత్స్యకార సొసైటీలో సభ్యత్వం ఇవ్వకుండా రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.