కొండగట్టు అంజన్న ఆలయానికి ఆదాయం రూ.కోటిపైనే..

కొండగట్టు అంజన్న ఆలయానికి ఆదాయం రూ.కోటిపైనే..

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. 24 రోజులకు సంబంధించి 12 హుండీల ద్వారా వచ్చిన డబ్బులను శుక్రవారం స్థానికంగా లెక్కించారు. ఇందులో మొత్తం రూ. 1,00,95,000తో పాటు, 44 విదేశీ నోటీలు వచ్చాయని ఈవో శ్రీకాంత్‌‌రావు తెలిపారు. అలాగే భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం, వెండిని తిరిగి బ్యాగుల్లో వేసి సీల్‌‌ చేసిన అనంతరం హుండీల్లోనే భద్రపరిచారు.

ఓ భక్తుడు ఐపీఎల్‌‌లో ఆర్సీబీ జట్టు గెలవాలని అంజన్నకు మొక్కుతూ చీటి రాసి హుండిలో వేశాడు. లెక్కింపులో ప్రధానార్చకులు రామకృష్ణ, స్థానాచార్యులు కపిందర్, సూపరిండెంట్లు సునీల్, చంద్రశేఖర్, హరిహరనాత్‌‌ పాల్గొన్నారు.