
వెలుగు, పద్మారావునగర్: సికింద్రాబాద్ మంజు థియేటర్ సమీపంలో భారీ పెల్టోఫోరం వృక్షం కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పెరిగి నిత్యం ట్రాఫిక్కు కారణమవుతోంది. దీంతో అటవీ శాఖ అధికారుల అనుమతితో నార్త్జోన్ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, మహంకాళి ట్రాఫిక్ ఆర్ఎస్ఐ పి.మహేశ్ , స్థానిక సామాజిక కార్యకర్తల సహకారంతో భారీ వృక్షాన్ని జేసీబీతో కూకటి వెళ్లతో పెకిలించి, సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు.